Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదుల లీకేజీ: వంద ఎకరాలు జలమయం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 04, 2026 3:12 PM హన్మకొండ General
దేవాదుల లీకేజీ: వంద ఎకరాలు జలమయం - Udayam
హనుమకొండ జిల్లా పులకుర్తి వద్ద దేవాదుల పైప్‌లైన్ లీకేజీతో వంద ఎకరాల పంట భూములు నీట మునిగాయి. శుక్రవారం రాత్రి నుండి నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి పెట్టి విత్తనాలు వేసిన భూములు కోతకు గురికావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...