వార్తలకు తిరిగి వెళ్లండి
కొండాపూర్ ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిరు వ్యాపార దుకాణాలను తొలగించేందుకు యత్నించడంతో స్థానికులు నిరసన తెలిపారు.
ముందస్తు నోటీసులు లేకుండా కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు జేసీబీకి అడ్డంగా పడుకుని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలపై ఆధారపడి బతుకుతున్న తమ ఉపాధిని లాక్కోవద్దని కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Loading comments...