వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
దీపం పథకంపై బిగ్ అప్డేట్

ఏపీ ప్రభుత్వం ‘దీపం-2’ పథకం లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ఇకపై సిలిండర్ బుకింగ్తో సంబంధం లేకుండా ప్రతి నాలుగు నెలలకొకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనుంది.
గతంలో ముందుగా సిలిండర్ కొనుగోలు చేశాకే ప్రభుత్వం ఆ డబ్బును రీయింబర్స్ చేసేది. కానీ కొత్త విధానంతో ముందే ఖాతాల్లో నగదు పడనుంది. ఈ మేరకు మంత్రివర్గం కీలక ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...