Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ లేక ఇబ్బందులు ప్రజావాణిలో ఫిర్యాదు

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 1:16 PM కామరెడ్డిGeneral
డ్రైనేజీ లేక ఇబ్బందులు ప్రజావాణిలో ఫిర్యాదు - Udayam
పిట్లం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పిట్లం పట్టణానికి చెందిన బత్తిని రాజు ద్వారకా సాయి నగర్ కాలనీ సమస్య ను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో డ్రైనేజీలు లేక వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని ఎంపీడీవో సాయన్న తెలిపారు.

Comments

G
Loading comments...