వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పురోగతిపై ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశ నిర్వహించారు. 100% డిజిటల్లైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, కమిషనర్ విజయ్ కుమార్, తాసిల్దార్ దిలీప్ కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
