వార్తలకు తిరిగి వెళ్లండి
కన్నతల్లిని ముంచిన కుమార్తె, అల్లుడు

వృద్ధురాలైన తల్లిని నమ్మించి రూ.32 లక్షలు కాజేసిన కుమార్తె, అల్లుడిపై విజయవాడ భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్బీకాలనీకి చెందిన భాగ్యమ్మ(85) వద్ద ఉన్న డబ్బును బాగుగా చూసుకుంటామని నమ్మించి బదిలీ చేసుకున్నారు.
బ్యాంకు ఖాతా పత్రాలపై వేలిముద్రలు తీసుకుని నగదు కాజేశాక బాధితురాలిని పట్టించుకోవడం మానేశారు. మందుల కోసం బ్యాంకుకు వెళ్లగా విషయం వెలుగులోకి రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Comments
Loading comments...