వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకరించి, యాగశాలలో సుదర్శన నరసింహ యాగం నిర్వహించారు.
అనంతరం స్వామివారిని గజవాహనంపై కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య పాంచరాత్ర ఆగమ పద్ధతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

