వార్తలకు తిరిగి వెళ్లండి
జలమండలి పేరుతో సైబర్ మోసం: రూ. 4.19 లక్షలు గల్లంతు

జలమండలి అధికారులమంటూ నమ్మించి ఎల్బీనగర్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు రూ. 4.19 లక్షలు కాజేశారు. వాటర్ బిల్లు బకాయి ఉందంటూ వాట్సాప్ మెసేజ్ పంపి, కేవైసీ (KYC) అప్డేట్ నెపంతో నకిలీ యాప్ను ఇన్స్టాల్ చేయించారు.
ఫోన్ను పూర్తిగా హ్యాక్ చేయడం ద్వారా, బాధితుడు ఓటీపీ చెప్పకపోయినా విడతలవారీగా డబ్బులు డ్రా చేసుకున్నారు. ఈ ఘటనపై మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...