వార్తలకు తిరిగి వెళ్లండి
యాదగిరిగుట్టలో రద్దీ.. బారులు తీరిన భక్తులు
భవేష్ కుమార్ Jun 28, 2026 8:30 AM యాదాద్రి భువనగిరి 4 viewsabout 1 hour ago

ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో క్యూలైన్లు బారులు తీరి, ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడి నెలకొంది. ప్రస్తుతం స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
లడ్డూ కౌంటర్లు, వ్రత మండపం, కల్యాణకట్ట, పుష్కరిణి వద్ద భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
Comments
Loading comments...