Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకలి చావులపై కోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 07, 2026 7:41 AM ఆల్ ఇండియా జాతీయ
ఆకలి చావులపై కోర్టు కీలక వ్యాఖ్యలు - Udayam Digital
ఆకలితో అల్లాడి అన్నం అడిగిన రెండేళ్ల కుమార్తెను కొట్టి చంపిన తల్లికి అహ్మదాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటన హృదయ విదారకమని, దీని వెనుక సామాజిక వైఫల్యం ఉందని జస్టిస్‌ హస్‌ముఖ్‌ డి.సుతార్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేరం ఒక్క తల్లిది మాత్రమే కాదని, యావత్తు సమాజానిదేనని పేర్కొన్నారు. ప్రతి మనిషికి కనీస అవసరాలు అందాలని, సామాజిక సంక్షేమ పథకాల వైఫల్యానికి అద్దం పట్టే ఘటనగా చూడాలని తెలిపారు.

Comments

G
Loading comments...