వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యాభర్తల గొడవను ఆపడానికి ప్రయత్నించిన హేమంత్ నాయక్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా మాయబాహల గ్రామంలో ఈ ఘటన జరిగింది. కందర్పదెహురి అనే వ్యక్తి తన భార్యపై దాడికి దిగగా, ఆమె ప్రాణభయంతో పొరుగున ఉన్న హేమంత్ ఇంట్లో దాక్కుంది.
నిందితుడిని హేమంత్ అడ్డుకోవడంతో, ఆగ్రహానికి గురైన కందర్ప పదునైన ఆయుధంతో హేమంత్పై దాడి చేసి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

