Back to feed
పార్ట్టైమ్ జాబ్ మోసం: మహిళకు రూ.5.47 లక్షలు నష్టం
Priya Jun 20, 2026 4:34 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago

ఇన్స్టాగ్రామ్ ప్రకటన చూసి పార్ట్టైమ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న చింతల్ మహిళ రూ. 5.47 లక్షలు కోల్పోయింది. టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిన బాధితురాలు, టాస్కులు పూర్తి చేస్తూ నమ్మి మోసపోయింది.
లాభాల ఆశ చూపి నిందితులు ఆమె నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. నగదు ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Loading comments...



