వార్తలకు తిరిగి వెళ్లండి
వేతనంతో పేద కుటుంబాలకు కౌన్సిలర్ సాయం

మంథని 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి కుమార్ తన రెండు నెలల వేతనాన్ని పేదల సంక్షేమానికి వినియోగించారు. బోయిన్పేటకు చెందిన నాలుగు నిరుపేద కుటుంబాలకు బియ్యం, కిరాణా సరకులు పంపిణీ చేశారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల వేతనాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టారు.
Comments
Loading comments...