Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేతనంతో పేద కుటుంబాలకు కౌన్సిలర్‌ సాయం

శ్రీజ రెడ్డి Jul 27, 2026 6:38 PM పెద్దపల్లి తెలంగాణ
వేతనంతో పేద కుటుంబాలకు కౌన్సిలర్‌ సాయం - Udayam Digital
మంథని 6వ వార్డు కౌన్సిలర్‌ పోతరవేని శ్రీలత క్రాంతి కుమార్‌ తన రెండు నెలల వేతనాన్ని పేదల సంక్షేమానికి వినియోగించారు. బోయిన్‌పేటకు చెందిన నాలుగు నిరుపేద కుటుంబాలకు బియ్యం, కిరాణా సరకులు పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల వేతనాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టారు.

Comments

G
Loading comments...