Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరోనాలోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం: కేటీఆర్

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 28, 2026 6:35 PM హైదరాబాద్తెలంగాణ
కరోనా కష్టకాలంలోనూ తమ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను క్రమం తప్పకుండా చెల్లించామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పరిపాలన చేతగాక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. తమ పాలనలో సంపద సృష్టించి ఇచ్చామని గుర్తుచేసిన ఆయన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఐటీ ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...