Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్గిపెట్టె కోసం వివాదం.. వ్యక్తి హత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:33 AM బాపట్లGeneral
అగ్గిపెట్టె కోసం వివాదం.. వ్యక్తి హత్య - Udayam
బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడులో అగ్గిపెట్టె కోసం మద్యం మత్తులో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. వ్యవసాయ కూలీ ఈపూరి యోహాన్‌(46)ను చరణ్‌తేజ కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యోహాన్‌ను తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...