Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కొనసాగింపు

Follow Udayam Digital on Google
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కొనసాగింపు - Udayam Digital
ఆక్వాకల్చర్ రంగానికి ఊతమిచ్చేలా ఆక్వా ఫామ్‌లకు యూనిట్‌కు రూ.1.50 విద్యుత్ టారిఫ్ రాయితీని 2026 జూన్ 1 నుంచి కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఆక్వా రైతులకు సుమారు రూ.1,150 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో విద్యుత్ భారం తగ్గి రొయ్యలు, చేపల సాగు చేసే రైతులకు ఉపశమనం లభించనుంది.

Comments

G
Loading comments...