వార్తలకు తిరిగి వెళ్లండి

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన 1,000 రోజుల విజయోత్సవ ర్యాలీని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని నాయకులు తెలిపారు.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

