వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా డక్కిలికి చెందిన హైమావతి కుమారుడు వెంకటాద్రి(16) ప్రాణాంతక లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. లివర్ మార్పిడి చేయాలని చెన్నై వైద్యులు సూచించారు.
చికిత్సకు కనీసం రూ.45 లక్షలు అవసరమని చెప్పడంతో పేద కుటుంబం తల్లడిల్లుతోంది. లివర్ ఇచ్చేందుకు అక్క సిద్ధమైనా ఆర్థిక స్థోమత లేక, కుమారుడిని కాపాడాలని తల్లి కలెక్టర్ హిమాన్షు శుక్లాను వేడుకున్నారు.
Comments
Loading comments...

