వార్తలకు తిరిగి వెళ్లండి
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాలేజీల బంద్
వివేక్ గౌడ్ Jun 27, 2026 5:58 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈనెల 30న రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. అదే రోజున పలు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు ఎంపీ కృష్ణయ్య తెలిపారు.
ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 2న మరోసారి బంద్ చేపడతామని బీసీ జేఏసీ ప్రకటించింది. అలాగే జూలై 15న హైదరాబాద్లో భారీ విద్యార్థి మార్చ్ నిర్వహించి తమ నిరసనను చాటుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...