వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ బావాజీపేటలో కలెక్టర్ లక్ష్మీశ్రీ మంగళవారం లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. జిల్లాలో 2,24,235 మంది లబ్ధిదారులకు రూ.97.16 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అర్హులైన వారికి ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...

