Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి కీలక సమన్వయ కమిటీ భేటీ

పవన్ కుమార్ Jul 16, 2026 6:25 AM అమరావతి 6 viewsabout 4 hours ago
కూటమి కీలక సమన్వయ కమిటీ భేటీ - Udayam Digital
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాడేపల్లిలో తెదేపా, జనసేన, భాజపాల రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. కూటమి పార్టీల మధ్య సమాచార లోపాన్ని సరిదిద్ది, ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్, పల్లా శ్రీనివాసరావు, పిడుగు హరిప్రసాద్, పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. కీలక పరిణామాలపై సమన్వయంతో ముందడుగు వేయాలని నేతలు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...