వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు రూ.92.20 కోట్లు అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏపీలో 85.25 శాతం ఆయకట్టు ఉన్నందున పునరుద్ధరణ వ్యయాన్ని నిష్పత్తి ప్రాతిపదికన పంచుకుని అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు.
ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే విజ్ఞప్తి చేసినా నిర్ణయం పెండింగ్లో ఉందన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

