వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన

ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై, రైతుల ఖాతాల్లో తుదివిడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.
ఈ సభకు సుమారు 2 లక్షల మంది రైతులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 150 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు, ఖమ్మం-బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Comments
Loading comments...