Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ భేటీ

Krishna Jun 22, 2026 8:44 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ భేటీ - Udayam Digital
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై చర్చించారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో డీఆర్డీవో ప్రాజెక్టు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.

Comments

G
Loading comments...