వార్తలకు తిరిగి వెళ్లండి
నేటి నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ఖమ్మం జిల్లాలోని 14 మండలాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులకు మధిర కేంద్రం నుంచి అల్పాహారం సరఫరా చేయనున్నారు.
హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర వంటశాల నుంచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు అల్పాహారం పంపిణీ చేస్తారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వంటశాలను ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...