వార్తలకు తిరిగి వెళ్లండి
మచిలీపట్నంలో మట్టి దందాలు

మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ, 'ముడ' భూముల నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిపోతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
డీసీఎంఎస్ ఛైర్మన్ స్వయంగా నిగ్గదీసినా చర్యలు కరువయ్యాయి. పలు మండలాల్లో చెరువులు, ప్రభుత్వ స్థలాలను తవ్వేస్తున్నా యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...