వార్తలకు తిరిగి వెళ్లండి

చిలిపిచేడు మండలం చిట్కుల్లో గురువారం మేకల సంత ప్రారంభమైంది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బస్టాండు ఆవరణలో సంత నిర్వహించారు. మేకలు, గొర్రెలు, నాటుకోళ్ల విక్రయాలకు వివిధ గ్రామాల నుంచి రైతులు, వ్యాపారులు తరలివచ్చారు.
రైతులు, వ్యాపారుల రాకతో బస్టాండు పరిసరాలు సందడిగా మారాయి. ప్రతి గురువారం సంత నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మేకలు, గొర్రెల కొనుగోలు, విక్రయాలకు మంచి స్పందన వస్తోందన్నారు.
Comments
Loading comments...

