Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తడిగా మారిన రోడ్డుతో ఇబ్బందులు

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 28, 2026 8:01 PM మంచిర్యాలతెలంగాణ
చిత్తడిగా మారిన రోడ్డుతో ఇబ్బందులు - Udayam Digital
జన్నారం మండలంలోని మొర్రిగూడ అనుబంధ భంగ్యా నాయక్ తండా రోడ్డు చిత్తడిగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం ఉదయం నుండి మండలంలో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో మొర్రిగూడెం నుండి భంగ్యా నాయక్ తండాకి వెళ్లే కచ్చా రోడ్డు పూర్తి బురదమయంగా మారింది. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు వాహనదారులతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సీసీ రోడ్డున నిర్మించాలని గ్రామస్తులు కోరారు.

Comments

G
Loading comments...