వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ శివారులోని చింతకుంటలోని గ్రీన్ హోమ్స్ కాలనీలో దొంగలు పడ్డారు. స్థానిక రిటైర్డ్ ఉద్యోగి దేవరాజు కుటుంబసమేతంగా బయటకు వెళ్లిన సమయం చూసి, ఇంటి తాళాలు పగలగొట్టారు.
బీరువాలోని పదివేల రూపాయల నగదుతో పాటు కొంత బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుడి సమాచారంతో పోలీసులు, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

