వార్తలకు తిరిగి వెళ్లండి
బురద రోడ్డుపై చిన్నారుల నరకయాతన

ముంచంగిపుట్టు మండలంలోని పలు గ్రామాల చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల మూడు కిలోమీటర్ల మట్టిరోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది.
ద్విచక్ర వాహనాలు కూడా తిరగని ఈ దారిలో నడుస్తూ విద్యార్థులు జారిపడుతున్నారు. నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న తాము తారురోడ్డు నిర్మించాలని ఐటీడీఏ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...