వార్తలకు తిరిగి వెళ్లండి
వరుస చోరీలకు చెక్: వినుకొండలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
దివ్య శ్రీ Jun 26, 2026 8:50 AM పల్నాడు 1 viewsabout 3 hours ago

రాష్ట్రవ్యాప్తంగా 25 చోరీ కేసుల్లో నిందితుడైన 'పొట్టి రఫీ'ని వినుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వినుకొండ, మదనపల్లి వంటి పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఈ మోస్ట్ వాంటెడ్ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడుల్లో భాగంగా నిందితుడి వద్ద నుంచి రూ. 27 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు, చోరీలకు ఉపయోగించిన ఆటో, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
Comments
Loading comments...