Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో జూన్ 28న పల్స్ పోలియో

నవీన్ రెడ్డి Jun 26, 2026 12:04 PM కర్నూలు 5 viewsabout 1 hour ago
కర్నూలులో జూన్ 28న పల్స్ పోలియో - Udayam Digital
కర్నూలు జిల్లాలో జూన్ 28 నుంచి 30 వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. జిల్లాలోని 0–5 ఏళ్లలోపు 3,52,164 మంది చిన్నారులకు చుక్కలు వేయడానికి 1,630 బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. జూన్ 28న పోలియో బూత్‌లలో, మిగిలిన వారికి 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ కోరారు.

Comments

G
Loading comments...