వార్తలకు తిరిగి వెళ్లండి
చంద్రబాబు గుడివాడ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం గుడివాడలో పర్యటించనున్నారు. ఏఎన్ఆర్ కళాశాలలో హెలిప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభా వేదికలను అధికారులు ఖరారు చేసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పర్యటనలో భాగంగా గౌతమ్ పాఠశాల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. పర్యటనకు గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
Comments
Loading comments...