వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ చిలకలగూడలో జరిగిన బీటెక్ విద్యార్థి అఖిల్ హత్య కేసులో పోలీసులు పది మందిని అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘాతుకానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 7న జరిగిన ఈ దాడితో మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Comments
Loading comments...

