వార్తలకు తిరిగి వెళ్లండి

రామంతపూర్లోని చర్చి కాలనీ రహదారి కొద్దిపాటి వర్షం కురిసినా చెరువును తలపిస్తోంది. కొన్ని రోజులపాటు వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
వాహనదారులకు గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాల బారినపడుతున్నారని, బురద నీటి నుంచే నడవాల్సి వస్తోందని పాదచారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై వరద నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

