Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీకేజీపై కేంద్రం బాధ్యత వహించాలి: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

విఘ్నేష్ రెడ్డి Jul 23, 2026 2:47 PM వరంగల్about 1 hour ago
నీట్ లీకేజీపై కేంద్రం బాధ్యత వహించాలి: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి - Udayam Digital
నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి డిమాండ్ చేశారు. దేవురుప్పుల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి చౌరస్తాలో ధర్నా చేశారు. కేంద్రం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని మండిపడ్డారు. విద్యార్థులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...