వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి స్పష్టం చేశారు. తగ్గిన ధరలు మరో 2, 3 నెలల పాటు ఇలాగే కొనసాగితేనే రేట్ల తగ్గింపుపై పునఃసమీక్షిస్తామన్నారు.
గతంలో పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, దేశీయంగా ప్రజలపై భారం వేయకపోవడం వల్లే ప్రభుత్వ చమురు సంస్థలు జూన్ నాటికి రూ.74,781 కోట్ల నష్టాలను చవిచూశాయని మంత్రి వెల్లడించారు.
Comments
Loading comments...

