Back to feed
తొట్టంబేడు వద్ద సిమెంట్ లారీ బోల్తా: డ్రైవర్కు గాయాలు
Ravi kumar Jun 13, 2026 6:38 AM చిత్తూరు 12 views2 days ago

చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పొయ్య వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నెల్లూరు నుండి అరక్కోణం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ తిరగబడటంతో డ్రైవర్ క్యాబిన్లోనే చిక్కుకుపోయాడు.
స్థానికులు వెంటనే స్పందించి అద్దాలు పగులగొట్టి డ్రైవర్ను బయటకు తీశారు. గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

