వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా కందుకూరులో నాగుల పంచమి రోజున తేళ్ల పంచమిని ఘనంగా నిర్వహించారు. కొండమవ్వ ఆలయంలో అమ్మవారితో పాటు తేళ్ల విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కొండపై రాళ్ల కింద కనిపించిన తేళ్లను చిన్నారులు, మహిళలు, యువత చేతుల్లోకి తీసుకుని శరీరంపై పెట్టుకున్నారు. తేళ్లు కుట్టకపోవడం అమ్మవారి అనుగ్రహమని భక్తులు విశ్వసిస్తున్నారు.
Comments
Loading comments...

