వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలోని పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా శుక్రవారం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు భారీగా చేపలు చిక్కాయి. ఇందులో చిన్న సైజు జెల్ల, మధ్యస్థాయి టేకు చేపలు ఉన్నాయి.
హార్బర్లో నిర్వహించిన బహిరంగ వేలంలో టేకు చేపలు కిలో రూ.300, జెల్ల చేపలు కిలో రూ.150 చొప్పున అమ్ముడయ్యాయి. టేకు చేపలను మాంసం వినియోగంతోపాటు వాణిజ్య ఎగుమతులకు ఉపయోగిస్తారని మత్స్యకారులు తెలిపారు.
Comments
Loading comments...

