Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అవగాహనతో తగ్గిన కేసులు

శిరీష గౌడ్ Jul 27, 2026 12:58 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
సైబర్ మోసాలపై అవగాహనతో తగ్గిన కేసులు - Udayam Digital
విశాఖ నగరంలో సైబర్ మోసాల కేసులు, బాధితులు కోల్పోతున్న నగదు గతేడాదితో పోల్చితే తగ్గినట్లు ఎన్‌సీఆర్‌పీ గణాంకాలు వెల్లడించాయి. పోలీసుల అవగాహన కార్యక్రమాలు ఇందుకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. సైబర్ మోసాలపై లఘు చిత్రాలు, ప్రచార కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే కేసులు నమోదు చేసి నగదు ఫ్రీజ్ చేసే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...