వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై మహ్మద్నగర్ సహకార సంఘానికి సంబంధించిన మరో కేసు నమోదైంది. నకిలీ ట్రక్షీట్లతో 2,200 ధాన్యం సంచులు రికార్డుల్లో చూపించి రూ.22 లక్షలు కాజేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
సహకార శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర గోదాంలలోనూ అక్రమాలు జరిగాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
Comments
Loading comments...
