వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ మండలం హుస్సేన్పురం సమీపంలో బుధవారం కారు అగ్నికి ఆహుతైంది. రాళ్ల అనంతపురం నుంచి కొడవండ్లపల్లి వైపు వెళ్తుండగా ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి.
ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు వెంటనే వాహనం దిగి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా కారును కాపాడలేకపోయారు.
Comments
Loading comments...

