వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ శిశుమందిర్ స్కూల్ వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో రమేష్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడిని బ్యాడ్మింటన్ తరగతికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలుడు కూడా గాయాలయ్యాడు.
హెల్మెట్ ధరించడంతో ఏడేళ్ల బాలుడికి ప్రాణాపాయం తప్పినా గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

