వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్ను వెంటనే తొలగించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులకు విత్తనాలు, కరెంటు కష్టాలు తప్పడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
రైతుబంధు పంపిణీలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments
Loading comments...

