వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపు

పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాస ఆధ్వర్యంలో రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది పేద విద్యార్థులకు రావాల్సిన రూ.7 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదని బీసీ ఐకాస ఛైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
Comments
Loading comments...