Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర వేళ 112కు ఫోన్‌ చేయండి: ఎస్‌ఐ

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 6:08 PM నారాయణపేటతెలంగాణ
అత్యవసర వేళ 112కు ఫోన్‌ చేయండి: ఎస్‌ఐ - Udayam
అత్యవసర పరిస్థితుల్లో జాతీయ టోల్‌ఫ్రీ నంబర్‌ 112ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని సత్యనారాయణస్వామి కూడలిలో 112పై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 112కు ఫోన్‌ చేసి ఘటన వివరాలను తెలియజేయాలని, సిబ్బంది అడిగే సమాచారాన్ని అందించాలని సూచించారు. ఫిర్యాదుపై సిబ్బంది తక్షణమే స్పందిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...