వార్తలకు తిరిగి వెళ్లండి
బస్సు ప్రయాణికులే దొంగల లక్ష్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లోని బస్స్టేషన్లలో ప్రయాణికులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను దేవరకొండ పోలీసులు పట్టుకున్నారు. బస్సెక్కే హడావుడిలో ఉన్న ప్రయాణికుల బ్యాగులను కట్ చేసి, వీరు సొమ్మును మాయం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నెల 1న ఓ మహిళ నుంచి రూ.2 లక్షలు దొంగిలించిన కేసులో విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...