వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం నుంచి కురుపాం ఆదర్శ పాఠశాలకు బస్సులో వస్తున్న 6వ తరగతి విద్యార్థి డి. మహేశ్ సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. కురుపాం బస్సు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ బస్సు వెనుక టైర్ విద్యార్థి కాలికి తగిలింది.
గాయాలైన మహేష్ను స్థానికులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి కాలి వేలు వద్ద గాయానికి 8 కుట్లు వేసి చికిత్స అందించారు.
Comments
Loading comments...

