వార్తలకు తిరిగి వెళ్లండి
మద్యం కోసం వృద్ధుడి ఘోర హత్య

కుమురం భీం జిల్లా రెబ్బెనలో మద్యం కోసం ఒక వృద్ధుడిని గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన శుక్రవారం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న కుమార్తెను రైలు ఎక్కించేందుకు వచ్చి బస్టాండ్ వైపు వెళ్లిన మాసండి సోమయ్యపై ఈ దాడి జరిగింది.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో దుండగుడు అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...